సీఎం హోదాలో వైఎస్ జగన్ ఇవాళ చివరి ప్రెస్మీట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ను జగన్ తొలిసారి పేరు పెట్టి పిలిచారు. సీఎంగా ఉన్నన్ని రోజులు ఆయన పేరు ఎత్తకుండా దత్తపుత్రుడు అని సంబోధించిన జగన్.. తాజా మీడియా సమావేశంలో 'పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు' అని వ్యాఖ్యానించారు.