దక్షిణ కొరియాలో ఇటీవల ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాదం తర్వాత విమానంలోని బ్లాక్ బాక్సులను స్వాధీనం చేసుకున్న అధికారులు అందులోకి డేటాను వెలికితీయగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరగడానికి నాలుగు నిమిషాల ముందే బ్లాక్ బాక్సులు మూగబోయాయని ద.కొరియా రవాణా మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. దర్యాప్తులో కీలకమైన ఈ సమాచారం కోల్పోవడంతో ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడం కష్టంగా మారిందన్నారు.