కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ పిసిసి అధ్యక్షులు, డి శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందడంతో శనివారం నిజామాబాద్ లోని అయన నివాసంలోపార్థివ దేహానికి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పరామర్శించిన వారిలో కాంగ్రెస్ నాయకులు కొట్టం మనోహర్, తదితరులు పాల్గొన్నారు.