ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పని చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. బుధవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్లు చంద్రమోహన్, శ్రీనివాసరెడ్డి, అదనపు ఎస్పీ నరసింహారెడ్డిలతో కలిసి నోడల్ అధికారులతో ఎన్నికల ప్రవర్తన నియమావళి, అనుమతులు, ఫిర్యాదులపై స్పందించుట, అక్రమ డబ్బు, మద్యం, ఈవీఎంల తరలింపు అంశాలపై సమీక్షించారు.