కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో గురువారం మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జడ్పిటిసి తీగల తిర్మల్ గౌడ్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ ఐరేని నరసయ్య, మాజీ ఎంపీటీసీ నల్లపు శ్రీనివాస్, నాయకులు మధు, గోపాల్ రెడ్డి, భోలేశ్వర్, రవీందర్, పాత రాము, తదితరులు పాల్గొన్నారు.