ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకుంటా అని ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె. మదన్ మోహన్ రావు అన్నారు. గాంధారి మండలం సర్వపూర్ లో కాంగ్రెస్ కార్యకర్త వెంకట్ అనారోగ్యంతో మృతి చెందాడు. మంగళవారం వెంకట్ కుటుంబాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ పరామర్శించి, ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకొని మిగిలిన జీతం ఎల్లారెడ్డి పేదల కోసం ఖర్చు చేస్తాన్నారు.