కంగనావి సిగ్గు చేటు వ్యాఖ్యలు: సిపిఎం

52చూసినవారు
కంగనావి సిగ్గు చేటు వ్యాఖ్యలు: సిపిఎం
మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులు సాగించిన పోరాటాన్ని విదేశీ శక్తుల సాయంతో దేశాన్ని అస్థిరపాల్జేసేందుకు సాగించిన జాతి వ్యతిరేక శక్తుల కుట్రగా పేర్కొనడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండించింది. కంగనావి సిగ్గుచేటు వ్యాఖ్యలని పేర్కొంది. దేశంలో జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను రైతుల ఉద్యమంతో ముడిపెట్టడానిన్ని తప్పుపట్టింది. నిజానికి రైతులు ఆందోళన సాగిస్తున్న సమయంలో లఖింపూర్‌ ఖేరిలో రైతులను హత్య చేసింది బిజెపి నేతలేనన్న విషయాన్ని సిపిఎం గుర్తు చేసింది.

సంబంధిత పోస్ట్