'సరైన విత్తన కొనుగోలు చేయాలి'
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామంలో వ్యవసాయ కూలీలకు సరైన విత్తన కొనుగోలు చేయాలని గంభీరావుపేట మండల వ్యవసాయ అధికారి అనూష అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, ప్రవీణ్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, గ్రామ ప్రజలు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎల్లయ్య, కూలీలు తదితరులు పాల్గొన్నారు.