కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం గోవిందాపూర్ గ్రామానికి చెందిన కోండు రవీందర్ అనే వ్యక్తి రెండో పెళ్లి చేసుకోగా, అతని భార్య లత శనివారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ వరంగంటి రవి తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. లత రవీందర్ కి 2009లో వివాహం జరిగిందని గొడవల కారణంగా కరీంనగర్ వెళ్తున్న అని చెప్పి వెళ్లి రెండో పెళ్లి చేసుకున్నాడు అన్నారు.