బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ గా రాయికల్ పట్టణానికి చెందిన కాయితి శంకర్ ను నియమిస్తున్నట్లు ఆ అకాడమీ నేషనల్ ప్రెసిడెంట్ నల్ల రాధాకృష్ణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కాయితి శంకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో వివిధ రంగాలలో ఎంతోమంది కృషి చేసినప్పటికీ వారికి సరియైన గుర్తింపు లభించడం లేదన్నారు. నేషనల్ అవార్డుతో సమాజంలో సరియైన గుర్తింపు లభిస్తుందన్నారు.