మల్లాపూర్ మండలంలోని రేగుంటలో మహాత్మ జ్యోతి రావు ఫూలే 198వ జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మస్జీద్ వద్ద ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ కుందేళ్ల నర్సయ్య, స్థానిక నాయకులు, ముదిరాజ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.