రోడ్డు ప్రమాదంలో ప్రముఖ ఫోటో గ్రాఫర్ మృతి
పాలకుర్తి మండలం బసంతనగర్ కు చెందిన చొప్పరి ఓదెలు శనివారం సాయంత్రం ఎన్టీపీసీ మళ్యాలపల్లి సబ్ స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఓదెలు బసంతనగర్లో ప్రముఖ ఫోటో గ్రాఫర్ గా మరియు ఒక ఛానెల్లో మీడియా రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు, అందరితో కలివిడిగా ఉండే ఓదెలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల అందరు శోక సంద్రంలో మునిగిపోయారు. కాగా మృతుడు ఓదెలుకు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.