పెద్దపల్లిలో అనుమతి లేకుండా కొనసాగుతున్న గోవధశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందు వాహిని జిల్లా సహ సంయోజక్ ఉయ్యంకార్ సాయికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు పూసాల శ్యాం, ప్రధాన కార్యదర్శి వెంకట్ సాయి, నాయకులు రాకేష్, వెంకటేష్, అరుణ్, రీక్షిత్, పవన్, శ్రీకాంత్, అజయ్, నరేష్ పాల్గొన్నారు.