బిజెపి నాయకుల ఇంటింటి ప్రచారం
సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామంలో శుక్రవారం బిజెపి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, మోడీని మరోసారి ప్రధాని చేయాలని, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా అర్వింద్ ధర్మపురిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొమ్మకంటి ప్రమోద్, సత్యచరణ్, తదితరులు పాల్గొన్నారు.