చింతకుంట యువకుడి అదృశ్యం

80చూసినవారు
చింతకుంట యువకుడి అదృశ్యం
కథలాపూర్‌ మండలం చింతకుంటకు చెందిన నేతుల మల్లేశం అదృశ్యమైనట్లు ఎస్సై నవీన్‌కుమార్‌ బుధవారం రాత్రి తెలిపారు. కాగా, మల్లేశం బైక్‌ మండలంలోని దుంపేట శివారులోని ఎస్సారెస్పీ కాలువ ఒడ్డున ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మల్లేశం బైక్‌పై వేగంగా వచ్చి వరదకాలువలో పడిపోయారా లేక ఇంకేమైనా జరిగిందా అనే విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటన స్థలాన్ని మెట్‌పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్‌రావు, కోరుట్ల సీఐ సురేశ్‌బాబు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్