కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

65చూసినవారు
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐసీడీఎస్, పీఎం పోషణ సహా.. అన్ని పథకాల ద్వారా రూ.17,082 కోట్ల వ్యయంతో ఫోర్టిఫైడ్ రైస్‌ను సరఫరా చేసేందుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అలాగే, గుజరాత్‌లో నేషనల్ మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్ ఏర్పాటు, పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాలకు కనెక్టివిటీ కోసం కొత్త రోడ్లను నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్