విద్యాక్షేత్రలో ఒత్తిడి లేని విద్య: మేయర్

84చూసినవారు
విద్యాక్షేత్రలో ఒత్తిడి లేని విద్య: మేయర్
ఖమ్మం మమత ఆస్పత్రి రోడ్డులోని శ్రీనగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటుచేసిన విద్యాక్షేత్ర పాఠశాలలో విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య అందనుందని మేయర్ పునుకొల్లు నీరజ తెలిపారు. నూతన పాఠశాలను సోమవారం ఆమె యజమాన్యం సౌభాగ్యం, భారతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ. పోటీ ప్రపంచంలో ఒత్తిడి లేని విద్య అందించేందుకు యజమాన్యం కట్టుబడి ఉండటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్