ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో శనివారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పర్యటించనున్నట్లు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్, మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ ఛార్జ్ లింగాల కమల్ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున మధిర పట్టణంలోని బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు సకాలంలో ఈ పర్యటనలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.