ఖమ్మం జిల్లా మధిర మండలంలోని బుచ్చిరెడ్డిపాలెంలో దారుణం జరిగింది. శనివారం ఉదయం రోడ్డుపై ఎడ్లబండి నిలిపి యజమాని పొలంలోని తాటి చెట్టు వద్ద కల్లు తాగడానికి వెళ్లాడు. దీంతో రోడ్డుపై ఎడ్ల బండి ఆపడం ఏంటని అటుగా వస్తున్న ఆటో డ్రైవర్ ప్రశ్నించడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు ఆటో డ్రైవర్ ను మధిర ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.