డిప్యూటీ సీఎంతో సమావేశమైన జగ్గయ్యపేట ఎమ్మెల్యే

67చూసినవారు
డిప్యూటీ సీఎంతో సమావేశమైన జగ్గయ్యపేట ఎమ్మెల్యే
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలుపొందిన శ్రీరామ్ తాతయ్య ముమ్మరంగా పర్యటించారు. ఈ సందర్భంగా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిసి అనంతరం వారితో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు.