సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు, ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం మాజీ ఎంపీటీసీ కామ్రేడ్ మలీదు నాగేశ్వరారావు భార్య మలీదు పద్మ సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. వారి మృతి పట్ల సిపిఐ(యం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరారావు, పార్టీ రాష్ట్ర కమిటి సభ్యురాలు బుగ్గవీటి సరళ, మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్ తదితరులు పద్మ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు.