ఇంటర్మీడియట్ ఎం.ఎల్.టి ఓకేషనల్ కోర్సులో ఉతీర్ణులైన విద్యార్ధిని, విద్యార్థులకు ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇవ్వబడును. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయం మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ శిక్షణకు ఎంపికైన విద్యార్థిని, విద్యార్థులు రూ.1000 లు ఆసుపత్రి పేరు మీదా డి. డి. రూపంలో చెల్లించవలసి ఉంటుంది. గతంలో ధరఖాస్తు చేసుకోని, ఎంపిక కానీ వారు దరఖాస్తు చేయాలి.