నీటితొట్టిలో పడి బాలుడు మృతి

7066చూసినవారు
నీటితొట్టిలో పడి బాలుడు మృతి
పెనుబల్లి మండలం లంకాసాగర్ కు చెందిన బాలుడు నీటి తొట్టిలో పడి మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కిరణ్- పద్మ దంపతులకు ఇద్దరు సంతానం. రైస్ మిల్లులో పనిచేస్తూ ఆయన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరి చిన్నకుమారుడు నిఖిల్ సాయి (3) శుక్రవారం మామిడి పండు కడుక్కునేందుకు నీటి తొట్టి వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు అందులో పడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు నిర్ధారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్