చెరువు ఆక్రమణలను తొలగించండి

81చూసినవారు
చెరువు ఆక్రమణలను తొలగించండి
వ్యవసాయ సీజన్ మొదలవుతున్నందున చెరువులు, తూములు, కాలువలు శుభ్రం చేయించి, చెరువు పరిధిలో ఆక్రమణలను తక్షణం తొలగించాలని ఎమ్మెల్యే మట్టా రాగమయి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సత్తుపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సోమవారం ఆమె పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. తొలుత వేంసూరు మండలం తాళ్ల చెరువును పరిశీలించారు. తమకు రైతులే ముఖ్యమని, చెరువు శిఖం భూములను ఆక్రమిస్తే కేసులు పెట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్