తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కారేపల్లి మండల తాసిల్దార్ సంపత్ కుమార్ అన్నారు. శుక్రవారం ఏర్పాట్లపై అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలన్నారు. ప్రజాప్రతినిధులు పాల్గొనే కార్యక్రమాల్లో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు లేకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు. 8; 25 జెండా ఆవిష్కరణ జరుగుతుందన్నారు.