మనస్తాపంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన శనివారం కామేపల్లి మండలం భాసిత్ నగర్లో జరిగింది. ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన ప్రకారం గ్రామానికి చెందిన బాదావత్ రవి (38) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఏ పనీ చేయకుండా ఖాళీగా తిరుగుతుండటంతో భార్య సుశీల అతణ్ని మందలించటంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ ఘటనపై ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.