ములకలపల్లి మండలంలోని కొత్త గంగారం గ్రామానికి చెందిన పెనుబల్లి సాగర్, జగన్నాధపురం గ్రామానికి చెందిన ఈసం లక్ష్మణ్ మార్చి 31న కడప జిల్లా పులివెందులలో కరెంటు స్తంభాల వైరింగ్ పని నిమిత్తం వెళ్లారు. అక్కడ నూతనపల్లి సబ్ స్టేషన్ నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో శనివారం ఇద్దరూ విద్యుత్ షాక్ కు గురయ్యారు. పెనుబల్లి సాగర్ మృతి చెందగా లక్ష్మణ్(20 )కూడా కడప ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.