మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న వలస ఆదివాసీల ఆరోగ్య స్థితిగతులను గుర్తించి వారికి తాత్కాలిక వైద్య పరీక్షలు జరిపి, వారు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత సామాజిక ఆరోగ్య కార్యకర్తలదేనని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతిక్ జైన్ అన్నారు. శనివారం ఐటీడీఏలోని వైటిసిలో సామాజిక ఆరోగ్య కార్యకర్తల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో పీవో పాల్గొని శిక్షణ తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలకు పలు సూచనలు చేసారు.