బూర్గంపాడు మండలం ప్రాథమిక పాఠశాల గాంధీనగర్ యందు ఎస్ఎంసి వారికి, ఐదవ తరగతి విద్యార్థులకు బుధవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పద్మావతి మాట్లాడుతూ. గత మూడు సంవత్సరముల నుండి ఎస్ఎంసి చైర్మన్ , సభ్యులు పాఠశాల ఉన్నతికి తోడ్పడినారని ఇప్పుడు వారి పదవీకాలం ముగిసినందున అలాగే ఐదవ తరగతి పూర్తి చేసుకుని వేరే స్కూల్ కి వెళుతున్న విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసామన్నారు.