కార్పొరేట్ ప్రాజెక్ట్ ప్లానింగ్ బృందం పర్యటన

80చూసినవారు
కార్పొరేట్ ప్రాజెక్ట్ ప్లానింగ్ బృందం పర్యటన
ఇల్లందు ఏరియాలోని జెకె5 ఉపరితల గనిలో సింగరేణి సంస్థ నూతనంగా ఏర్పాటు చేయాలనుకున్న పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ కొరకు కార్పొరేట్ ప్రాజెక్ట్ ప్లానింగ్ బృందం  మంగళవారం పర్యటించింది. ఈసందర్బంగా వారు ఏరియా జీయం జాన్ ఆనంద్ తో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ కొరకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. ఈ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్, సహజ వనరులను వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్