అమరావతి రైల్వే లైన్‌కు తెలంగాణలో భూసేకరణ

61చూసినవారు
అమరావతి రైల్వే లైన్‌కు తెలంగాణలో భూసేకరణ
ఏపీ రాజధాని అమరావతికి రైలు సౌకర్యం కల్పించేలా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు నిర్మిస్తున్న 56.53 కిలోమీటర్ల బ్రాడ్‌ గేజ్‌ లైన్‌కు తెలంగాణ ప్రాంతంలో భూసేకరణ చేపట్టేందుకు రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు పనులు పర్యవేక్షించేందుకు ఖమ్మం జిల్లా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ను కాంపిటెంట్‌ అథారిటీగా నియమిస్తూ నిన్న ఉత్తర్వులిచ్చింది. ఈ రైల్వే లైన్‌ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఆయన పర్యవేక్షించనున్నారు.

సంబంధిత పోస్ట్