ఘనంగా ప్రారంభమైన లష్కర్ బోనాలు

3166చూసినవారు
ఘనంగా ప్రారంభమైన లష్కర్ బోనాలు
సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. నేడు తెల్లవారుజాము నుండే ఉత్సవాలు జరుపుతున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. పోలీసులు 2 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు రంగం నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయం సమీపంలో పోతరాజుల ఆటలు, శివసత్తుల పూనకాలు, ఘటాల ఊరేగింపులతో సందడి నెలకొంది.

సంబంధిత పోస్ట్