సోషల్ మీడియాలో సన్రైజర్స్ ఆల్రౌండర్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి పేరే మార్మోగిపోతోంది. మంగళవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో నితీష్ 64 పరుగులతో చెలరేగడమే. నితీశ్ రెడ్డి ఇలా రెచ్చిపోవడానికి కారణం పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ అట. మ్యాచ్కు ముందు ‘జానీ’ సినిమాలోని ‘నారాజుగాకురా మా అన్నయ్యా.’ అనే పాటను వింటానని నితీశ్ తెలిపాడు. ఈ పాట బీట్, ఎనర్జీ తనకు బూస్ట్ ఇస్తుందని చెప్పాడు.