MIM కంచుకోట అయిన హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఓటమి పాలయ్యే అవకాశాలు ఉన్నాయని India Today Axis My India సర్వే వెల్లడించింది. ఒవైసీపై బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఒవైసీ, మాధవీ లత మధ్య హోరాహోరీ పోరు సాగినప్పటికీ.. మాధవీ లతనే గెలుపు వరించనుందని తెలిపింది. మొత్తంగా తెలంగాణలో బీజేపీకి 11-12 సీట్లు రావొచ్చని పేర్కొంది.