అడ్డాకుల మండలం వర్ని గ్రామ కాంగ్రెస్ కార్యకర్త జలనీల శేఖర్ ఆదివారం సాయంత్రం మరణించిన విషయం తెలుసుకొని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశానుసారం అతని కుటుంబానికి రూ. 10వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఆర్గనైజింగ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు నాగిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీహరి, జిల్లా కార్యదర్శి విజయమోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.