2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు మండల కార్యాలయాలకు చేరుకున్నాయి. పాఠశాల ప్రారంభంలోనే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, కాపీలు అందించాలన్న ప్రభుత్వం లక్ష్యంతో అధికారులు మండల కార్యాలయాలకు పుస్తకాలను గత రెండు రోజులుగా తరలించే ఏర్పాట్లు చేశారు. సోమవారం మండల కార్యాలయాల నుంచి కొన్ని పాఠశాలల ఉపాధ్యాయులు పాఠశాలలకు తరలించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.