ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. మసీదు ఇమామ్ ఫజ్లూర్ రెహ్మాన్ అనే వ్యక్తిని నరికి చంపారు. ఆ వ్యక్తిని చంపేసిన అనంతరం మొండెం నుంచి తల వేరు చేసి.. 500 మీటర్ల దూరంలో పడేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో అనుమానాస్పదంగా మృతుని కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.