బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ సందడి నెలకొంది. ఎంగిలిపూల బతుకమ్మ పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణం చుట్టుపక్కల మండలాల గ్రామాల నుంచి తంగేడు పువ్వు, బంతి పువ్వు, ఇతర పూలను తీసుకువచ్చి మెయిన్ రోడ్డుకు ఇరువైపులా విక్రయించారు. బజార్ ఏరియా నుంచి కాంటా చౌరస్తా వరకు పూల అమ్మకాలతో కిటకిటలాడింది.