37 ఏళ్లు గడుస్తున్న వార్డులో సౌకర్యాలు లేవు

57చూసినవారు
37 ఏళ్లు గడుస్తున్న వార్డులో సౌకర్యాలు లేవు
బెల్లంపల్లి పట్టణంలోని కాంట్రాక్టర్ బస్తి 1987లో మున్సిపల్ ద్వారా వార్డుగా ఏర్పాటై 37 ఏళ్లు గడుస్తున్న బస్తీలో కనీస సౌకర్యాలు నోచుకోవడం లేదని బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వార్డ్ ప్రతినిధులు రామ్ మోహన్, శ్రీనివాస్ మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. అండర్ డ్రైనేజీ నిర్మాణం సరిగా లేదన్నారు. దారులు కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టడంతో 108 అంబులెన్స్ రావడం లేదు అన్నారు.