ఎంపీడీఓ ఆదేశాల మేరకు చలివేంద్రం ఏర్పాటు

536చూసినవారు
ఎంపీడీఓ ఆదేశాల మేరకు చలివేంద్రం ఏర్పాటు
వేసవి కాలం దృష్ట్యా ప్రజల దాహార్తి తీర్చేందుకు ఎంపీడీఓ రాధా రాథోడ్ ఆదేశాల మేరకు బుధవారం భీమారం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వివిధ అవసరాల నిమిత్తం వివిధ గ్రామాల నుండి మండల కేంద్రానికి వచ్చే ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ప్రారంభించినట్లు తెలిపారు. కాగా చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్