విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఈదునూరి అభినవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న రూ. 8, 214 కోట్ల ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి అన్ని వసతులు కల్పించాలన్నారు.