ధరలు పెంచిన మారుతీ సుజుకీ

61చూసినవారు
ధరలు పెంచిన మారుతీ సుజుకీ
ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ పలు కార్ల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. స్విఫ్ట్‌తో పాటు ఎస్‌యూవీ గ్రాండ్ విటారాలో ఎంపిక చేసిన వేరియంట్‌ కార్ల ధరల్ని పెంచినట్లు పేర్కొంది. కొత్త ధరలు ఈ రోజు (ఏప్రిల్‌10) నుంచే అమల్లోకి వస్తాయని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. స్విఫ్ట్ వాహన ధరను రూ.25,000, ఇక గ్రాండ్‌ విటారాలో సిగ్మా వేరియంట్‌ ధరను రూ.19,000 పెంచినట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్