ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ పలు కార్ల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. స్విఫ్ట్తో పాటు ఎస్యూవీ గ్రాండ్ విటారాలో ఎంపిక చేసిన వేరియంట్ కార్ల ధరల్ని పెంచినట్లు పేర్కొంది. కొత్త ధరలు ఈ రోజు (ఏప్రిల్10) నుంచే అమల్లోకి వస్తాయని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. స్విఫ్ట్ వాహన ధరను రూ.25,000, ఇక గ్రాండ్ విటారాలో సిగ్మా వేరియంట్ ధరను రూ.19,000 పెంచినట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది.