కేంద్రపాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీలోని నరోలి గ్రామంలో గల పాలిమర్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకుని పోలీసులు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.