మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇదే క్రమంలో భారీ శబ్దంతో కొబ్బరి చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగాయి. అక్కడే పని చేస్తున్న కొందరు భారీ శబ్దం రావడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైయ్యారు. ఎవరికి ఎలాంటి హాని కలగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు ఉన్నారు.