మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం అంసాన్ పల్లి గ్రామంలో విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ మంగళవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో విద్యార్థులతో కలిసి ఆయన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న సేవలను ప్రజలకు వివరించారు. బడి ఈడు పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.