జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామ శివారు కెనాల్ కాలువలో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని ఓ యువకుడు మృతదేహం బుధవారం లభ్యమయింది. స్థానికుల సమాచారం మేరకు స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎవరు, ఈ ఘటన ఎలా జరిగింది, అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.