నలుగురు పిల్లల్ని నీటిలో పడేసి కన్న పేగును తుంచుకుంది ఓ కసాయి తల్లి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, ఒకరు గల్లంతయ్యారు. మరొక చిన్నారిని స్థానికులు కాపాడినట్లు సమాచారం. ఈ ఘటన యుపిలోని ఔరయ్యాలో జరిగింది. ప్రియాంక అనే మహిళ తన నలుగురు పిల్లలతో సమీప ఘాట్కు వెళ్లి అక్కడ వారిని నీటిలో ముంచి చంపింది. ఇద్దరు పిల్లల మృతదేహాలను ఘాట్ నుండి స్వాధీనం చేసుకున్నారు. వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నారని ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.