అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.
నార్పలలో మూడేళ్ల క్రితం ఓ యువకుడి హత్య జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురిని దోషులుగా తేల్చి కోర్టుకు సాక్ష్యాలు సమర్పించారు. సోమవారం విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.