నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు: జానీ మాస్టర్ భార్య

60చూసినవారు
నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు: జానీ మాస్టర్ భార్య
లైంగిక వేధింపుల కేసులో చంచల్ గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్‌ను అతని భార్య అయేషా శుక్రవారం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జానీ మాస్టర్ భార్య ఆయేషా.. తన భర్త ఎలాంటి తప్పు చేయలేదన్నారు. కావాలనే ఆ అమ్మాయి ఎవరి మాటలో విని ఈ కేసు పెట్టింది. జానీ మాస్టర్‌ నిజం ఒప్పుకున్నారని మీడియాలో థంబ్‌నెయిల్స్ పెడుతున్నారని, అదంతా అవాస్తవమని కొట్టిపడేశారు. న్యాయంతో ఈ కేసును ఎదురుకుంటామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్