మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ బెయిల్ కోసం మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన భార్య క్యాన్సర్ తో బాధపడుతూ చివరి దశలో చావు బతుకుల మధ్య ఉండడంతో.. బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. గోయల్ అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును మే 6వ తేదీకి వాయిదా వేసింది.